Wednesday, October 14, 2015
Tuesday, March 10, 2015
ఇది పిచ్చి సుబ్బయ్య కధ
--------------------------
అదే ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగారికన్నాముందుగా హాజరయే ఓ వ్యక్తి
పూజారి వెళ్ళింతర్వాత మాత్రమే వెళ్ళే వ్యక్తి,పిచ్చి సుబ్బయ్య.
ఎప్పుడూ అదోలోకంలో మాలోకంగా అమాయకంగా వుండే వాడు.
ప్రతిరోజూ గుడికి హాజరయే అంకిత భక్తుడు సుబ్బయ్యే.
ఓ మూల కూర్చుని భజనరోజుల్లో తాళాలుపట్టుకుని ధ్యానమగ్నుడై
వుండే వాడు.మహాయోగిపుంగవుడిలా కనులు మూసుకుని పరధ్యానంలో వుండే వాడు.అది యేదేవుడి ఊరేగింపయినా ముందు వరసలో దేవుడిపటం పట్టుకుని ఇంకోలోకంలో విహరిస్తూన్న అవధూతలా వుండే వాడు.
బేధమల్లా ,అవధూతల్లా అర్ధ నగ్నంగానో అసలు నగ్నంగానో వుండడీ సుబ్బయ్య. ధోతీ[ముతక ఖద్దరు కట్టుకునిపైన కేవలం ఓ తువ్వాలు మాత్రం వేసుకుని తిరుగుతుండే వాడు. రోజూ 9 గంటలనుండీ
వూరిలో ఎవరొకరింటిలో భజనలు నిరంతరం జరుగుతుండే వి.అక్కడా సుబ్బయ్య హాజరయే వాడు. సుబ్బాయ్య అనారోగ్యం పాలయాడని తెలిసిన రోజు ఒక్కటీ కనబడదు. అది నిజంగా యోగమే గదా మరి.
సంసారం పిల్లలూ వున్నారు. అయినా అదో అయోమయం మనిషిలా
భక్తి పారవస్యన్లో తిరుగుతూ వుంటాడు.వేనుగోపాలస్వామి ఊరేగింపులో ముక్కు స్వామి[గరుత్మంతుడి] ప్రక్కగా తనూ నిలుచుని వుండే వాడు. ఇక పుష్య మాసం వచ్చిందంటే నెలరోజుల పాటు
తెల్ల వారుఝామున నలుగురు భక్తులు తాళాలు వాయించుకుంటూ
ఊరు నాలుగు బజార్లూ క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆ భజన సమాజంలో
దేవుడి పటం పట్టుకుని ముందు నడవడానికి సుబ్బాయ్యే ఉండె వాడు..
చలీ గిలీ సుబ్బయ్యకు జాంతానై అన్ని ఋతువుల్లోనూ అదే ఆహార్యమే.
ఎవరన్నా ప్రసాదమిస్తే కళ్లకద్దుకునీమరీ తీసుకునే వాడు.
ప్రతిప్రసాదాన్నీ ఇంటికే పట్టుకెళ్ళేవాడు.ఇంట్లో వాళ్ళూ ఆయన ధోరణిని నిరసించినట్లు ఋజువులేవీ లేవు.
సుబ్బయ్య లేని డేవుడిగుడినేఎ,ఊరేగింపునూ ఎవ్వరూ ఊహించుకోలేరు.ఇక స్రీరామ నవమి పండగొస్తే అది సుబ్బయ్య పండగే.తాటాకు పందిళ్లు వెసే దగ్గరనుంచీ పండగయాక గుంజలు పీక్కెళ్ళేదాకా సుబ్బయ్యదే
కుశాలంతా.అలాగే హనుమజ్జయంతినాడు సుబ్బయ్య హాజరయి అన్ని కార్యక్రమాలూ నిర్విఘ్నంగా జరగాలని కోరుకునె వాడిలా
పరమ ఉచ్చిలితో హుషారుగా వుండే వాడు.శ్రీరామ నవమి దాటాక మా వూరి లో వసంతం బండి ఊరేగేది.గంగాళం నిండా రంగునీళ్లతో
నలుగురైదు పిల్లలు బండిమీదకెక్కి పిచికారీ జల్లే వారు.ఎవరింటిదగ్గరయినా ప్రసాదం పళ్ళెంలో తెస్తే సుబ్బయ్యే అందుకుని పూజారిగారికిచ్చి కొబ్బరి కాయ కొట్టాక ప్రసాదం
కొబ్బరి చిప్పతో తిరిగి వాళ్ళకందిచే పని మా సుబ్బయ్యదేసుమా!!
===================================================
--------------------------
అదే ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగారికన్నాముందుగా హాజరయే ఓ వ్యక్తి
పూజారి వెళ్ళింతర్వాత మాత్రమే వెళ్ళే వ్యక్తి,పిచ్చి సుబ్బయ్య.
ఎప్పుడూ అదోలోకంలో మాలోకంగా అమాయకంగా వుండే వాడు.
ప్రతిరోజూ గుడికి హాజరయే అంకిత భక్తుడు సుబ్బయ్యే.
ఓ మూల కూర్చుని భజనరోజుల్లో తాళాలుపట్టుకుని ధ్యానమగ్నుడై
వుండే వాడు.మహాయోగిపుంగవుడిలా కనులు మూసుకుని పరధ్యానంలో వుండే వాడు.అది యేదేవుడి ఊరేగింపయినా ముందు వరసలో దేవుడిపటం పట్టుకుని ఇంకోలోకంలో విహరిస్తూన్న అవధూతలా వుండే వాడు.
బేధమల్లా ,అవధూతల్లా అర్ధ నగ్నంగానో అసలు నగ్నంగానో వుండడీ సుబ్బయ్య. ధోతీ[ముతక ఖద్దరు కట్టుకునిపైన కేవలం ఓ తువ్వాలు మాత్రం వేసుకుని తిరుగుతుండే వాడు. రోజూ 9 గంటలనుండీ
వూరిలో ఎవరొకరింటిలో భజనలు నిరంతరం జరుగుతుండే వి.అక్కడా సుబ్బయ్య హాజరయే వాడు. సుబ్బాయ్య అనారోగ్యం పాలయాడని తెలిసిన రోజు ఒక్కటీ కనబడదు. అది నిజంగా యోగమే గదా మరి.
సంసారం పిల్లలూ వున్నారు. అయినా అదో అయోమయం మనిషిలా
భక్తి పారవస్యన్లో తిరుగుతూ వుంటాడు.వేనుగోపాలస్వామి ఊరేగింపులో ముక్కు స్వామి[గరుత్మంతుడి] ప్రక్కగా తనూ నిలుచుని వుండే వాడు. ఇక పుష్య మాసం వచ్చిందంటే నెలరోజుల పాటు
తెల్ల వారుఝామున నలుగురు భక్తులు తాళాలు వాయించుకుంటూ
ఊరు నాలుగు బజార్లూ క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆ భజన సమాజంలో
దేవుడి పటం పట్టుకుని ముందు నడవడానికి సుబ్బాయ్యే ఉండె వాడు..
చలీ గిలీ సుబ్బయ్యకు జాంతానై అన్ని ఋతువుల్లోనూ అదే ఆహార్యమే.
ఎవరన్నా ప్రసాదమిస్తే కళ్లకద్దుకునీమరీ తీసుకునే వాడు.
ప్రతిప్రసాదాన్నీ ఇంటికే పట్టుకెళ్ళేవాడు.ఇంట్లో వాళ్ళూ ఆయన ధోరణిని నిరసించినట్లు ఋజువులేవీ లేవు.
సుబ్బయ్య లేని డేవుడిగుడినేఎ,ఊరేగింపునూ ఎవ్వరూ ఊహించుకోలేరు.ఇక స్రీరామ నవమి పండగొస్తే అది సుబ్బయ్య పండగే.తాటాకు పందిళ్లు వెసే దగ్గరనుంచీ పండగయాక గుంజలు పీక్కెళ్ళేదాకా సుబ్బయ్యదే
కుశాలంతా.అలాగే హనుమజ్జయంతినాడు సుబ్బయ్య హాజరయి అన్ని కార్యక్రమాలూ నిర్విఘ్నంగా జరగాలని కోరుకునె వాడిలా
పరమ ఉచ్చిలితో హుషారుగా వుండే వాడు.శ్రీరామ నవమి దాటాక మా వూరి లో వసంతం బండి ఊరేగేది.గంగాళం నిండా రంగునీళ్లతో
నలుగురైదు పిల్లలు బండిమీదకెక్కి పిచికారీ జల్లే వారు.ఎవరింటిదగ్గరయినా ప్రసాదం పళ్ళెంలో తెస్తే సుబ్బయ్యే అందుకుని పూజారిగారికిచ్చి కొబ్బరి కాయ కొట్టాక ప్రసాదం
కొబ్బరి చిప్పతో తిరిగి వాళ్ళకందిచే పని మా సుబ్బయ్యదేసుమా!!
===================================================
కట్టుబాటులో కవిత్వమా? సంకెళ్ళలో సంగీతమా?
===============================================
పూర్వం కవులకు చందస్సులూ,యతిప్రాసలు నియమనిబంధనులుగానిలిస్తే ఆధునికులకు సామాజిక
స్పృహ కట్టుబాటై కొందరిని శ్రంఖలా బద్ధులను గావించింది.
ఫలితంగా ఆనాటి శ్రీ శ్రీలాంటి కవులకు కార్బన్ పేపర్లలా కొందరు కవితలు వెలువడి ఒకరకంగా మూసదారిలో నడిచాయనే చెప్పుకోవచ్చు.
నిరంకుశంగా వుండవలసిన కవిని నియమ బద్ధం గావించడమంటే
సంగీత కారుణ్ణి సంకెళ్ళలో బంధించి కచ్చేరీ చేయమనడం
లాంటిదే. ఇక ఆ గాయకుడికి ఏం స్వేచ్చ లభిస్తుంది?
అలాగే క్రాతదర్శిగా రూపొందవలసిన కవికుమారుడిని కట్తుబాట్లలో కట్తిపడేస్తే కవి ఎంత స్వతంత్రంగా కవిత్వం రాసి వినిపించగలుగుతాడు.
స్పందన కళాకారుడికి సహజసిద్ధంగా కలుగుతుంది.
ఇతరుల బలవంతం వల్లవచ్చే స్పందన అభినందనలందుకునే స్థాయిలో కవితను రూపొందకుండా అడ్డుపడుతుండి.కేటలాగుకవిత్వానికీఅదరణ లభిస్తుందా?
ప్రతి హృదయాన్నీ రంజింపజేసే కవితలు వెలువడాలంటే
కవిని నియంత్రణలకు దూరంగా తన కవితారచన చేసుకునే
వీలు కలిగించాలి.అప్పుడే విశ్వ శ్రేయోదాయకమైన కవితలు వెలువడె వీలు యేర్పడుతుంది.తన కవితా సృష్టినీ, దృష్టినీ ఏకాగ్రతతో లగ్నం చేసుకునే వీలు యేర్పడుతుంది.అప్పుడే కవికూడా కారణజన్ముడన్న మాటకు సోదాహరణంగా నిలబడగలుగుతాడు.
====================================================
===============================================
పూర్వం కవులకు చందస్సులూ,యతిప్రాసలు నియమనిబంధనులుగానిలిస్తే ఆధునికులకు సామాజిక
స్పృహ కట్టుబాటై కొందరిని శ్రంఖలా బద్ధులను గావించింది.
ఫలితంగా ఆనాటి శ్రీ శ్రీలాంటి కవులకు కార్బన్ పేపర్లలా కొందరు కవితలు వెలువడి ఒకరకంగా మూసదారిలో నడిచాయనే చెప్పుకోవచ్చు.
నిరంకుశంగా వుండవలసిన కవిని నియమ బద్ధం గావించడమంటే
సంగీత కారుణ్ణి సంకెళ్ళలో బంధించి కచ్చేరీ చేయమనడం
లాంటిదే. ఇక ఆ గాయకుడికి ఏం స్వేచ్చ లభిస్తుంది?
అలాగే క్రాతదర్శిగా రూపొందవలసిన కవికుమారుడిని కట్తుబాట్లలో కట్తిపడేస్తే కవి ఎంత స్వతంత్రంగా కవిత్వం రాసి వినిపించగలుగుతాడు.
స్పందన కళాకారుడికి సహజసిద్ధంగా కలుగుతుంది.
ఇతరుల బలవంతం వల్లవచ్చే స్పందన అభినందనలందుకునే స్థాయిలో కవితను రూపొందకుండా అడ్డుపడుతుండి.కేటలాగుకవిత్వానికీఅదరణ లభిస్తుందా?
ప్రతి హృదయాన్నీ రంజింపజేసే కవితలు వెలువడాలంటే
కవిని నియంత్రణలకు దూరంగా తన కవితారచన చేసుకునే
వీలు కలిగించాలి.అప్పుడే విశ్వ శ్రేయోదాయకమైన కవితలు వెలువడె వీలు యేర్పడుతుంది.తన కవితా సృష్టినీ, దృష్టినీ ఏకాగ్రతతో లగ్నం చేసుకునే వీలు యేర్పడుతుంది.అప్పుడే కవికూడా కారణజన్ముడన్న మాటకు సోదాహరణంగా నిలబడగలుగుతాడు.
====================================================
Monday, February 16, 2015
వలపు వాన
---------------
కొండ కోనలలోన
వెండి వెన్నెలవోలె
వలపు తలపుల తడిసి
మెరిసి మురిసెను వలపు.
అడవి దారుల తిరిగి
మధుర ఫలముల మేసి
రమ్య భావనలరసి
రాగరంజితమగుచు
రాణకెక్కెను వయసు
యేడ నున్నదొ తాను
నేను ఎరుగగలేను
వెదకి తెలుపుడు మీరు
అప్సరో భామినుల
అంతరంగములాన
ధన్యునిగ తలతును
మీరలిచ్చెడు సేవ
మరువజాలను మదిన
ప్రతిభ బడసిన మీరు
పరాకు పడుటే తగదు
ఈ తరుణీ అలామ
అరుణారుణపు తీరు
కాంతిరేఖయె సుమ్ము
వెదకి చెప్పిన చాలు
వేల వేల వరహాలు
వరుమానమనుకొనుడు.
చీకటాయెను బ్రదుకు
గొంతు దిగదే మెతుకు?
కడలి మించెను కనులు
ధారలుగ ప్రవహించు
అశ్రు సరసులతోడ.
---------------------------------------
---------------
కొండ కోనలలోన
వెండి వెన్నెలవోలె
వలపు తలపుల తడిసి
మెరిసి మురిసెను వలపు.
అడవి దారుల తిరిగి
మధుర ఫలముల మేసి
రమ్య భావనలరసి
రాగరంజితమగుచు
రాణకెక్కెను వయసు
యేడ నున్నదొ తాను
నేను ఎరుగగలేను
వెదకి తెలుపుడు మీరు
అప్సరో భామినుల
అంతరంగములాన
ధన్యునిగ తలతును
మీరలిచ్చెడు సేవ
మరువజాలను మదిన
ప్రతిభ బడసిన మీరు
పరాకు పడుటే తగదు
ఈ తరుణీ అలామ
అరుణారుణపు తీరు
కాంతిరేఖయె సుమ్ము
వెదకి చెప్పిన చాలు
వేల వేల వరహాలు
వరుమానమనుకొనుడు.
చీకటాయెను బ్రదుకు
గొంతు దిగదే మెతుకు?
కడలి మించెను కనులు
ధారలుగ ప్రవహించు
అశ్రు సరసులతోడ.
---------------------------------------
Sunday, February 15, 2015
పరుషమై సరళమై -------------------రావెల పురుషోత్తమ రావు.----------------------జీవితం చిత్రాతి చిత్రమైనది.వెలుగు వేళల్లో వేదనాక్రాంతయౌతుంది.చీకటి సమయాల్లో చిరునవ్వులు చిందిస్తుంది.ఒక్కోసమయంలో ఒక్కో విధంగా స్పందిస్తుంది.గుండె గొంతుకతో గునాళించేలా మట్లాడడమూ నేర్చుకుంటుందిఅవసర సమయాల్లో ఆలోచనలకుఅసలు ఆస్కారమంటూ ఇవ్వకుండాఆగ్రహోదగ్రమై అగ్ని వర్షం కురిపిస్తుంది.జీవితనేపధ్యమే అలాదు.యవ్వన దశలో జలపాతంలాఎగిరెగిరి పడుతుంది,నడివయసు రాగానే నలుపుతెలుపుల వెనుకరంగుల కలలనే కంటుంది.అసుర సంధ్యవేళకు అంతా ఆశలుడిగిన ప్రాణిలాఅడుగడున దిగులు మొహంతోనే దర్శనమివ్వ జూపుతుంది.వెలుగులనదుకునే వేళలోనే తిమిరానికి సమర ఝంఝను చూపించాలీ,వినిపించగలగాలి,నీడల జాడలను స్పృశిస్తూ నిమ్నోత్తాలనుకది[ఏలా కృషిచేయ డానికి ప్రయత్నం సాగించాలి.సందర్భమేదైనా సరిగ పదమని శాసించే స్థితికి ఎదగ గలగాలి.పరుష సరళాలలోనూ ప్రత్యేక దిశగా సాక్షాత్కరించడమేజీవితపు వైవిధ్యమని గుర్తెరిగి జవాబుదారిగాజీవితాన్ని ఆవిషరించుకో గలగాలి. మలచుకొని మహోన్నతంగా నిలవాలి,^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Saturday, February 7, 2015
సదసత్సంశయం.
---------------
ఒకప్పుడు కారడువుల్లొ మాత్రమే
కాకులు కాపురం ఉండేవని వినికిడి.
ఇటీవలి కాలం దాకా ఇంటి పెరటిగోదపైనుండి కాకి అరిస్తే
చుట్టాలొస్తారని అనుకునే ఆనవాయితీ ఉండేది.
ఇప్పుడు కాకుల జాడే కనుమరుగయే స్థితికి జారుకున్నాం.
చని పోయిన వారికి పిండం పెట్టడం గూడా దండగేనని భావించే
కల్కికాలంలో కాలూనడం కూడా వ్యర్ధమని భావించాయేమో
లేదా నీతి కధలోలాగా కుండల్లో నింపడానికి నీరుంచే వారే లేరని
ఈ కఠినమైన నిర్ణయాని కొచ్చివుంటుందని నా సదసత్సంశయం.
------------------------------------------------------------------------------------------------------
ఏక్కడో ఆకాశం నుంచి
ఊడిపడ్డ అప్సరసలా
మంచు తునకను
మించిన అందంతో
అపురూపంగా నువ్వు.
క్షణకాలం కూడా
శాంత స్వరూపంలా
ఉండలేని కుపిత మనస్కుడనై
దైనందిన మార్తాండునిలా
ఆగ్రహోదగ్రంగా నేను
ఇద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా
ఎలా కలిసిపోయామోచూడు!
ప్రణయానికి పరిధులా? అంటూ
పరిహసించగలలోకానికి
సోదాహరణం మేమేనంటూ
పరవశింపజేస్తున్న ప్రణయమా! నీకు జోహార్లు!
-------------------------------------------------------------------------------------------------------
ప్రణయాంజలి-2
---------------------
మందార మకరందపు
మాధుర్యమే నువ్వు
మల్లెల గునాళింపులో
సురభిళ పరిమళమే నువ్వు.
నువ్వు మనసును
రంజింపజేయగల రాగానివి.
చిత్త చాంచల్యం కలిగించగల
సౌందర్య లలామము.
అందుకే ప్రణయమా ! నీకు
శతసహస్ర ప్రణామాలు.
-------------------------------------
పల్లె పదం
****************
కనులలో సంక్రాతి కాంతులే గనరావు
ఆకాశ హర్మ్యాలు అడ్డుగాన
ఇంటిలో మెట్టుపై ఇంపుగా కనపట్టు
ధాన్యపు బస్తాలు ధాటిలేదు
ఎడ్ల బండులులేవు గొడ్ల పాకలు లేవు
పాడి పంటల వూసు పనికి రాదు
పార్టీల వారిగా ప్రజలు వేరుగ మారె
సంక్షేమ మరసెడు సభ్యులెవరు
పల్లె గూటిలొ పక్షులే తల్లడిల్లె
సుఖము శాంతియు క్షోభగా పరిణమించె
ఏడనుండెను పండుగ ఏడ పరువు?
పల్లె తల్లికి కన్నీటి భాగ్య మబ్బె.
*********************************
సంభవామి దినే దినే-----
==========================
ఎక్కడో పిడుగు పడిన చప్పుడు
ఇది అరాచకంగా పిల్లలను
కిరాతకంగా,పరమ క్రూరంగా
అకాల మృత్యువు పాల్జేస్తున్న
ఆటంక వాదులను హరిస్తే బావుండు.
మతం మాటున మూర్ఖంగా కప్పుకున్న ముసుగులో
మారణ హోమానికి ద్వారాలను తెరుస్తూ
నానాటికీ మృగ్యమై పోతున్న మానవత్వానికి
కారణ భూతులై నిలిచిన కసాయీల మీదపడి
వారి వికృత ప్రణాళికలకు కపాలమోక్షం సంభవిస్తే
ఎంత బావుంటుందో--మళ్ళీ మరోమంచి భారతాన్ని పునర్నించుకోవచ్చు.
మిట్ట మధ్యాహ్నమే నడివీధిలో నలుగురూ తిరుగుతున్న సమయంలోనే
కసు గాయల్లాంటి కన్నె పిల్లల శీలాన్ని హరించే
మగ మృగయా వినో దుల మీదపడి ఆ మృగ జాతిని అంతమొందిస్తే ఎంత బావుణ్ణు.
అప్పుడే ఈ పిడుగు పాటుకు సమయోచితమైన సార్ధకత సంప్రాప్తిస్తుంది.
------------------------------------------------------------------------
నామాoతరం
---------
తన పేరు మరచాను
మరోపేరుతో పిలిచాను
కోపం రాని కోయిల
కమ్మగా పాడింది.
పేరుతోగాదు స్వరంతో
గుర్తు పట్టు చాలు నంటూ
చిలిపిగా నవ్వింది.
========
ఒక దీపం దిగులుగా చెప్పింది
ఇతరుల జీవితాలను కొండెక్కిచ్చ వొద్దని!
ప్రేమ పెల్లుబికేలా అరిచింది
ఇతరుల హృదయాలను ద్వేషిచండం మానుకొమ్మని,
-----------------------------------------------------------------------
శుభ కామన----రావెల పురుషోత్తమ రావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పయనించే చిలుకనే నేను
పాడుబడిన గూడయినా
పాత బడిన ఇల్లయినా
నాకు నివాస యోగ్యమైనవే.
కొత్త పాతల మేలు
కలయిక కావాలన్న
తాపత్రయం పడలేదెప్పుడూ.
తలదాచుకోగలిగే స్థలం చాలులెమ్మని
సర్దుకు పోయే మనస్తత్వమే నాది.
ఒంటరితనం వేధిస్తున్న వాళ్ళ చెంతకుజేరి
అనునయ వాక్యాలు పలికి ఊరడిస్తుంటాను.
పచ్చని చెట్తుపై పైరగాలుల ఫలహారాలను
భుజించాను ఒకప్పుడు. వసంతకాలపు వైదగ్ధ్యాన్ని
వివరంగా అనుభవించాను.
శిశిరకాలంలో శీర్ణ పత్రాలనుచూస్తూ
కాలం వెళ్ళబుచ్చిన ఘనత నాకున్నది.
తిరమై సంపదలెల్ల ఒక రీతిన సాగిరానేరవని
నమ్మిన ప్రాణిని నేను.
బాగా బతికినాకూడా భ్రమలకు దూరంగా
కాలాన్ని వెచ్చించిన ఘనాపాఠీని కూడానేనే.
ఆచరించిన ధర్మం అమూల్యంగా ఆర్జించిన కీర్తి
చిరంతనంగా తోడుంటాయని నమ్మిన చైతన్యాన్ని నేను.
అందుకే నాకు నరజాతిపైన గాఢమైన అనురాగం.
పలికేనాలుగు పలుకులూ నొప్పింపక నేనుగా నొవ్వకుండా
శుభ సూచనలుగా అందరి శుభం కోరుకుంటూ కామనల నందిస్తున్నాను.
********************************************
ఇద్దరంకలిసి నడచినంత కాలం
ఇబ్బడిముబ్బడి గ సంతోషమే సామ్రాజ్యమే మఇంది.
నువ్వు దూర దూర తీరాలకు సాగిపోయాక
ఒంటరిగా కాలం వెళ్ళదీయడంకష్ట తరమనిపిస్తుంది.
పిడుగు పడింది ఎక్కడోనయినా
భయం మాత్రం నా గుండె లోకె పరుగెడుతున్నది.
పూలన్నీ వాడినట్లుమొహం చాటేసినా
పరిమళ గంధం నన్నువీడ బోదన్నది
మాత్రం ప్రత్యక్షర సత్యం.
========================
---------------
ఒకప్పుడు కారడువుల్లొ మాత్రమే
కాకులు కాపురం ఉండేవని వినికిడి.
ఇటీవలి కాలం దాకా ఇంటి పెరటిగోదపైనుండి కాకి అరిస్తే
చుట్టాలొస్తారని అనుకునే ఆనవాయితీ ఉండేది.
ఇప్పుడు కాకుల జాడే కనుమరుగయే స్థితికి జారుకున్నాం.
చని పోయిన వారికి పిండం పెట్టడం గూడా దండగేనని భావించే
కల్కికాలంలో కాలూనడం కూడా వ్యర్ధమని భావించాయేమో
లేదా నీతి కధలోలాగా కుండల్లో నింపడానికి నీరుంచే వారే లేరని
ఈ కఠినమైన నిర్ణయాని కొచ్చివుంటుందని నా సదసత్సంశయం.
------------------------------------------------------------------------------------------------------
ఏక్కడో ఆకాశం నుంచి
ఊడిపడ్డ అప్సరసలా
మంచు తునకను
మించిన అందంతో
అపురూపంగా నువ్వు.
క్షణకాలం కూడా
శాంత స్వరూపంలా
ఉండలేని కుపిత మనస్కుడనై
దైనందిన మార్తాండునిలా
ఆగ్రహోదగ్రంగా నేను
ఇద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా
ఎలా కలిసిపోయామోచూడు!
ప్రణయానికి పరిధులా? అంటూ
పరిహసించగలలోకానికి
సోదాహరణం మేమేనంటూ
పరవశింపజేస్తున్న ప్రణయమా! నీకు జోహార్లు!
-------------------------------------------------------------------------------------------------------
ప్రణయాంజలి-2
---------------------
మందార మకరందపు
మాధుర్యమే నువ్వు
మల్లెల గునాళింపులో
సురభిళ పరిమళమే నువ్వు.
నువ్వు మనసును
రంజింపజేయగల రాగానివి.
చిత్త చాంచల్యం కలిగించగల
సౌందర్య లలామము.
అందుకే ప్రణయమా ! నీకు
శతసహస్ర ప్రణామాలు.
-------------------------------------
పల్లె పదం
****************
కనులలో సంక్రాతి కాంతులే గనరావు
ఆకాశ హర్మ్యాలు అడ్డుగాన
ఇంటిలో మెట్టుపై ఇంపుగా కనపట్టు
ధాన్యపు బస్తాలు ధాటిలేదు
ఎడ్ల బండులులేవు గొడ్ల పాకలు లేవు
పాడి పంటల వూసు పనికి రాదు
పార్టీల వారిగా ప్రజలు వేరుగ మారె
సంక్షేమ మరసెడు సభ్యులెవరు
పల్లె గూటిలొ పక్షులే తల్లడిల్లె
సుఖము శాంతియు క్షోభగా పరిణమించె
ఏడనుండెను పండుగ ఏడ పరువు?
పల్లె తల్లికి కన్నీటి భాగ్య మబ్బె.
*********************************
సంభవామి దినే దినే-----
==========================
ఎక్కడో పిడుగు పడిన చప్పుడు
ఇది అరాచకంగా పిల్లలను
కిరాతకంగా,పరమ క్రూరంగా
అకాల మృత్యువు పాల్జేస్తున్న
ఆటంక వాదులను హరిస్తే బావుండు.
మతం మాటున మూర్ఖంగా కప్పుకున్న ముసుగులో
మారణ హోమానికి ద్వారాలను తెరుస్తూ
నానాటికీ మృగ్యమై పోతున్న మానవత్వానికి
కారణ భూతులై నిలిచిన కసాయీల మీదపడి
వారి వికృత ప్రణాళికలకు కపాలమోక్షం సంభవిస్తే
ఎంత బావుంటుందో--మళ్ళీ మరోమంచి భారతాన్ని పునర్నించుకోవచ్చు.
మిట్ట మధ్యాహ్నమే నడివీధిలో నలుగురూ తిరుగుతున్న సమయంలోనే
కసు గాయల్లాంటి కన్నె పిల్లల శీలాన్ని హరించే
మగ మృగయా వినో దుల మీదపడి ఆ మృగ జాతిని అంతమొందిస్తే ఎంత బావుణ్ణు.
అప్పుడే ఈ పిడుగు పాటుకు సమయోచితమైన సార్ధకత సంప్రాప్తిస్తుంది.
------------------------------------------------------------------------
నామాoతరం
---------
తన పేరు మరచాను
మరోపేరుతో పిలిచాను
కోపం రాని కోయిల
కమ్మగా పాడింది.
పేరుతోగాదు స్వరంతో
గుర్తు పట్టు చాలు నంటూ
చిలిపిగా నవ్వింది.
========
ఒక దీపం దిగులుగా చెప్పింది
ఇతరుల జీవితాలను కొండెక్కిచ్చ వొద్దని!
ప్రేమ పెల్లుబికేలా అరిచింది
ఇతరుల హృదయాలను ద్వేషిచండం మానుకొమ్మని,
-----------------------------------------------------------------------
శుభ కామన----రావెల పురుషోత్తమ రావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పయనించే చిలుకనే నేను
పాడుబడిన గూడయినా
పాత బడిన ఇల్లయినా
నాకు నివాస యోగ్యమైనవే.
కొత్త పాతల మేలు
కలయిక కావాలన్న
తాపత్రయం పడలేదెప్పుడూ.
తలదాచుకోగలిగే స్థలం చాలులెమ్మని
సర్దుకు పోయే మనస్తత్వమే నాది.
ఒంటరితనం వేధిస్తున్న వాళ్ళ చెంతకుజేరి
అనునయ వాక్యాలు పలికి ఊరడిస్తుంటాను.
పచ్చని చెట్తుపై పైరగాలుల ఫలహారాలను
భుజించాను ఒకప్పుడు. వసంతకాలపు వైదగ్ధ్యాన్ని
వివరంగా అనుభవించాను.
శిశిరకాలంలో శీర్ణ పత్రాలనుచూస్తూ
కాలం వెళ్ళబుచ్చిన ఘనత నాకున్నది.
తిరమై సంపదలెల్ల ఒక రీతిన సాగిరానేరవని
నమ్మిన ప్రాణిని నేను.
బాగా బతికినాకూడా భ్రమలకు దూరంగా
కాలాన్ని వెచ్చించిన ఘనాపాఠీని కూడానేనే.
ఆచరించిన ధర్మం అమూల్యంగా ఆర్జించిన కీర్తి
చిరంతనంగా తోడుంటాయని నమ్మిన చైతన్యాన్ని నేను.
అందుకే నాకు నరజాతిపైన గాఢమైన అనురాగం.
పలికేనాలుగు పలుకులూ నొప్పింపక నేనుగా నొవ్వకుండా
శుభ సూచనలుగా అందరి శుభం కోరుకుంటూ కామనల నందిస్తున్నాను.
********************************************
ఇద్దరంకలిసి నడచినంత కాలం
ఇబ్బడిముబ్బడి గ సంతోషమే సామ్రాజ్యమే మఇంది.
నువ్వు దూర దూర తీరాలకు సాగిపోయాక
ఒంటరిగా కాలం వెళ్ళదీయడంకష్ట తరమనిపిస్తుంది.
పిడుగు పడింది ఎక్కడోనయినా
భయం మాత్రం నా గుండె లోకె పరుగెడుతున్నది.
పూలన్నీ వాడినట్లుమొహం చాటేసినా
పరిమళ గంధం నన్నువీడ బోదన్నది
మాత్రం ప్రత్యక్షర సత్యం.
========================
Thursday, February 5, 2015
నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.
అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.
ఆ తరువాతి కవిత ఏవరో
ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!
అలాగే
ద్రుపది ఒంటిని దాచిన
చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.
కౌగలించుకుని చుంబించాను
ఎవరి ప్రేయసినో
ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ
పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.
నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.
అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.
ఆ తరువాతి కవిత ఏవరో
ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!
అలాగే
ద్రుపది ఒంటిని దాచిన
చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.
కౌగలించుకుని చుంబించాను
ఎవరి ప్రేయసినో
ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ
పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.
ఎనిమిదోకవిత "ప్రపంచ పొరుడా జోహారు!"అన్నది
సంతానం కనకు
అడివికొట్టి జాగా చేయకు
సంద్రంలో ఉప్పును నాకి హుళక్కీ చేయకు.
సూర్యుడితో అగ్గిపుల్ల ముట్టించకు
నీ బిడ్దలకు బడి కట్టించకు
ఐదఘుల చదరపడుగుల
నేలను వెతుక్కో
వీలునామా వ్రాసే అవస్థ లేదు--రాదు కూడా
అంటూ
పుట్టని సంతానానికి నీపేరే పెడతాం
ఆలయంలోనువ్వు వెలుపల మేం
అంతర్ధానమై మా స్వప్నంలో కనబడగలిగితే నీకు మా జోహారు. అని చమత్కరిస్తాడు.
'నాకు జబ్బు చేసిందీ అన్నది పదోకవిత ఇందులో లోకంలో వున్న రకరకాల జబ్బులలిస్టులనూ వాట్కి చక్కని ప్రిస్క్రిప్షన్ ఉదాహరిస్తాడు. చలా వడి వడిగా నడిచే కవిత ఇది.ఇందులో బుచ్చిబాబుగారికున్న ప్రపంచ జ్ఞానం
మనకు సుబోధకమై నిలుస్తుంది.
కట్నంతో కన్నె పిల్ల
భర్తే దైవం
కుచేల సంతానం
కార్మికుల స్వర్గం
కాన్సర్ టీబీల కలసివున్న కాపురం
కూడులేని బిడ్డలే కర్షకుల ధాన్యం
అని నొక్కి వక్కాణిస్తూ
అంతేనా గుడ్దిలోకం
చరిత్ర చినుగులు కుడతావా?
నాకరికత శిధిలంపైనా నీ మకాం
కరుణ చూపని దైవమేనా నీ మొగుడు?
ఆకలి బాధల్ని కన్నావా
గతాన్ని పొట్టన బెట్టుకుని
లావైనావుగానీచావులేదా నీకు గుడ్డిలోకమా
అని గుచ్చి గుచ్చి తరచి తరచీ ప్రశ్ణీస్తాడు,
ప్రేమ పచ్చది
కీర్తికి ఎరుపు
హోదాకి ఆకు పచ్చ
ధనానికి నలుపు
వైరాగ్యానికి తెలుపు
అన్నీ వున్న వాడికేమో నా గుడ్ది కన్ను!
ఇవ్వండిక మీ కళ్ళకొలతలు
చచ్చిన మర్నాడు సరుకు సిద్ధం అని ఘంటా పధంగా చెప్తాడు తనమనో భావాలను కవి.
ఆఖరి కవిత అన్నింటిలోనూ సుదీర్ఘమైనది.
యుద్ధంలో శిధిలమైన
కొండ శిబిరం వలె
దుఃఖంలో ఏకమైన మంచు శిఖరాలు,
మంచుని మించిని మించిన తెల్లటి మందహాసం
మనలోమానవుడి వుయ్యాల.
మన శిఖరాలు అతని ఆదర్శం.
నానిశ్శబ్దం కవితంటాడు
నాఉనికే చిత్రకళంటాడు
నారక్తం అతని గుండెమీది గులాబీ పుష్పం.
నాతెలుపు అతని హృదయం
నాకంటీత్తు అతని ఆదర్శ శిఖరం
నాకంటె వెడల్పు అతని మానవ తత్వం
----
--
అతని ఎముక నా వెన్నెముక
అతని కన్ను మూత నా స్వప్న.ం
---
పచ్చ కొండలో పుడతాను
మనిషి గుండెలోకెడతాను.
అతనేనేను
నేనే అతను
అంటూ వచన కావ్యాన్ని ముగిస్తాడు బుచ్చి బాబు.
బుచ్చిబాబు ఆ సమయానికి కేవలం నినాదాలతో నింపబడి నిస్సారమైపోఉన్న
కవితామతల్లికి సుమహారంగా సహితీ సుగతునికి అన్వర్ధమైన స్వాగతం పలికేలా
తన వచన కావ్యాన్ని అందిస్తాడు.
మానవత్వాన్ని దాని విలువల్ని చాటే విధంగా మనకొక చిత్రరూప దర్శనం గావించారు ఈ కావ్యంతో ప్రతిభాశాలిగా బుచ్
Click to reply all
|
Send
v
|
Wednesday, February 4, 2015
ప్రేమాయణం
============
నువ్వు నన్ను ప్రేమించావా?
సరే !ఆ పూల మొక్కనడిగి చూడు.
వడలి పోయి, రెక్కలు రాలి పడి
ఎంత కళాహీనంగా కనిపిస్తున్నదో చూడు.
అది మన ప్రేమ పురస్సరంగా నువ్ నాటిన మొక్కేగదా!
సరయిన పోషణ లభించక చిక్కి ఏలా శల్యమైంది గమనించు.
నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా?
వేయి శకలాలుగా కూలబడ్డ ఈ హృదయా న్ననడుగు.
అంటుకోవడానికి వీలు కాని విధంగా వ్రక్కలుజేసి
అలమటింపజేసావు గదా, ఈ సున్నిత హృదయాన్ని.
ప్రేమంటే అర్ధం తెలుసుకో!
ప్రేమించడంలోని అంతరార్ధం గ్రహించు!!.
మరోజన్మలోనయినా ప్రేమ సాఫల్యతను గురించి
నీకు బోధ పడే వీలుకలుగుతుంది.
ప్రేమ అనే పదం సార్ధకమై గెలిచి నిలుస్తుంది.!!!
==================================
============
నువ్వు నన్ను ప్రేమించావా?
సరే !ఆ పూల మొక్కనడిగి చూడు.
వడలి పోయి, రెక్కలు రాలి పడి
ఎంత కళాహీనంగా కనిపిస్తున్నదో చూడు.
అది మన ప్రేమ పురస్సరంగా నువ్ నాటిన మొక్కేగదా!
సరయిన పోషణ లభించక చిక్కి ఏలా శల్యమైంది గమనించు.
నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా?
వేయి శకలాలుగా కూలబడ్డ ఈ హృదయా న్ననడుగు.
అంటుకోవడానికి వీలు కాని విధంగా వ్రక్కలుజేసి
అలమటింపజేసావు గదా, ఈ సున్నిత హృదయాన్ని.
ప్రేమంటే అర్ధం తెలుసుకో!
ప్రేమించడంలోని అంతరార్ధం గ్రహించు!!.
మరోజన్మలోనయినా ప్రేమ సాఫల్యతను గురించి
నీకు బోధ పడే వీలుకలుగుతుంది.
ప్రేమ అనే పదం సార్ధకమై గెలిచి నిలుస్తుంది.!!!
==================================
Tuesday, February 3, 2015
Saturday, January 31, 2015
కధ కంచికి మనంలోపలింటికి.
------------రావెల పురుషోత్తమరావు
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
అతను పెద్ద నేరంచేసాడట
క్షుద్బాధకు తాళలేక
ఓ బన్రొట్టెను దొంగతనం చేసాడట.
రక్షకభట సమూహం అతనిపై నేరం మోపుతూ
న్యాయస్థానంలో ఓ వ్యాజ్యం వేసింది.
కళ్ళు పూర్తిగా మూసుకుపోయిన న్యాయస్థానం
తనవంతు కృషిగా అతనికి ఉరిశిక్షను విధించింది.
ఆతర్వాత దొంగలు దొంగలు మరోలోకంవెళ్ళాక
న్యాయాన్ని సమీక్ష ద్వారా పంచుకున్నారు.
ఒకరినొకరు ఉరితీసుకోవాల్ని తీర్మానించుకున్నారు.
------------రావెల పురుషోత్తమరావు
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
అతను పెద్ద నేరంచేసాడట
క్షుద్బాధకు తాళలేక
ఓ బన్రొట్టెను దొంగతనం చేసాడట.
రక్షకభట సమూహం అతనిపై నేరం మోపుతూ
న్యాయస్థానంలో ఓ వ్యాజ్యం వేసింది.
కళ్ళు పూర్తిగా మూసుకుపోయిన న్యాయస్థానం
తనవంతు కృషిగా అతనికి ఉరిశిక్షను విధించింది.
ఆతర్వాత దొంగలు దొంగలు మరోలోకంవెళ్ళాక
న్యాయాన్ని సమీక్ష ద్వారా పంచుకున్నారు.
ఒకరినొకరు ఉరితీసుకోవాల్ని తీర్మానించుకున్నారు.
వాళ్ళకు వాళ్ళే శిక్ష అమలయ్యేలా చూసుకున్నారు.
అందరిదేహాలూ ఉరికంబానికి వ్రేలాడడం మొదలెట్టాయి.
మంచి మనసును నమ్ముకున్నమనుషులంతా మౌనదీక్ష జేసి
మూగ ప్రేక్షకులుగా ఇహలోకంలో మిగిలిపోయారు.
ఇక కధ కంచికి మనo లోపలింటికి..
అందరిదేహాలూ ఉరికంబానికి వ్రేలాడడం మొదలెట్టాయి.
మంచి మనసును నమ్ముకున్నమనుషులంతా మౌనదీక్ష జేసి
మూగ ప్రేక్షకులుగా ఇహలోకంలో మిగిలిపోయారు.
ఇక కధ కంచికి మనo లోపలింటికి..
-----------------------------------------------------------------------
దంత వేదాంతం
---------------------
ఈదంతాలకెంత పొగరో
వయసు మీదపడకముందు
ఒక్కొక్కటే రాలిపడి
తొర్రిపళ్ళల్లో తొండచిక్కిందని
అందరూ వెక్కిరించేలా చేస్తుంది.
---------------------
ఈదంతాలకెంత పొగరో
వయసు మీదపడకముందు
ఒక్కొక్కటే రాలిపడి
తొర్రిపళ్ళల్లో తొండచిక్కిందని
అందరూ వెక్కిరించేలా చేస్తుంది.
ఈదంతాలకెంత బిగుతో
వయసు మీదపడి శరీరం
కట్టెలపొయ్యిమీదకెక్కి
దేహమంతా చితాభస్మమై
మిగిలినా మేం రాలిపడం పొమ్మంటూ
వయసు మీదపడి శరీరం
కట్టెలపొయ్యిమీదకెక్కి
దేహమంతా చితాభస్మమై
మిగిలినా మేం రాలిపడం పొమ్మంటూ
భీష్మించుకుని అలానే ఉండిపోతాయి.
ఎవ్వరూ ఎప్పుడూ నా పళ్ళు రాలగొట్టే
పనులేవీ నేప్పుడూ చేయలేదు
సుమా అనుకుంటూ
సగర్వంగా చెప్పుకుని మురిసిపోతుంటాయి.
ముచ్చటపడుతూంటాయి.
ఎవ్వరూ ఎప్పుడూ నా పళ్ళు రాలగొట్టే
పనులేవీ నేప్పుడూ చేయలేదు
సుమా అనుకుంటూ
సగర్వంగా చెప్పుకుని మురిసిపోతుంటాయి.
ముచ్చటపడుతూంటాయి.
అలామనిషి బూడిదయినా చెక్కుచెదరనిది
దంత సౌందర్యమేనని ఎందరికి జ్ఞప్తికొస్తుంటుందో!
----------------------------------------------------------
దంత సౌందర్యమేనని ఎందరికి జ్ఞప్తికొస్తుంటుందో!
----------------------------------------------------------
Wednesday, January 28, 2015
అచలం--అమోఘం
*************
ఏడు పదులు సమీపిస్తున్న నాజీవన యానంలో
ఎందరి జన్మలను చూసాను ఎందరి మరణాలగూర్చో విన్నాను.
జననమప్పుడు పొంగిపోలేదు మరణాలప్పుడూ కృంగినట్ళులేదు
ఈ ఆకాశం,చంద్రుడూ సూర్య భగవానుడూ లోయలూ కొండలూ కోనలూ
అలాగే చలనరహితంగానే ఉన్నాయ్. జననమైనా మరణమైనా ప్రతి ప్రాణికీ సహజమని తెలిసాక
భ్రమలను తొలగించుకున్నాను భయాన్ని దూరం చేసుకున్నాను.
నిశ్చలంగా నిలబడి వుండడంలోని లౌక్యాన్నీ,సౌఖ్యాన్ని గ్రహించాను.
ఇక జర రుజలపట్ల మౌనం వహించడమే మేలనుకుంటున్నాను ===========================
ఏడు పదులు సమీపిస్తున్న నాజీవన యానంలో
ఎందరి జన్మలను చూసాను ఎందరి మరణాలగూర్చో విన్నాను.
జననమప్పుడు పొంగిపోలేదు మరణాలప్పుడూ కృంగినట్ళులేదు
ఈ ఆకాశం,చంద్రుడూ సూర్య భగవానుడూ లోయలూ కొండలూ కోనలూ
అలాగే చలనరహితంగానే ఉన్నాయ్. జననమైనా మరణమైనా ప్రతి ప్రాణికీ సహజమని తెలిసాక
భ్రమలను తొలగించుకున్నాను భయాన్ని దూరం చేసుకున్నాను.
నిశ్చలంగా నిలబడి వుండడంలోని లౌక్యాన్నీ,సౌఖ్యాన్ని గ్రహించాను.
ఇక జర రుజలపట్ల మౌనం వహించడమే మేలనుకుంటున్నాను ===========================
Subscribe to:
Comments (Atom)