నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.
అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.
ఆ తరువాతి కవిత ఏవరో
ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!
అలాగే
ద్రుపది ఒంటిని దాచిన
చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.
కౌగలించుకుని చుంబించాను
ఎవరి ప్రేయసినో
ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ
పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.
నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.
అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.
ఆ తరువాతి కవిత ఏవరో
ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!
అలాగే
ద్రుపది ఒంటిని దాచిన
చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.
కౌగలించుకుని చుంబించాను
ఎవరి ప్రేయసినో
ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ
పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.
ఎనిమిదోకవిత "ప్రపంచ పొరుడా జోహారు!"అన్నది
సంతానం కనకు
అడివికొట్టి జాగా చేయకు
సంద్రంలో ఉప్పును నాకి హుళక్కీ చేయకు.
సూర్యుడితో అగ్గిపుల్ల ముట్టించకు
నీ బిడ్దలకు బడి కట్టించకు
ఐదఘుల చదరపడుగుల
నేలను వెతుక్కో
వీలునామా వ్రాసే అవస్థ లేదు--రాదు కూడా
అంటూ
పుట్టని సంతానానికి నీపేరే పెడతాం
ఆలయంలోనువ్వు వెలుపల మేం
అంతర్ధానమై మా స్వప్నంలో కనబడగలిగితే నీకు మా జోహారు. అని చమత్కరిస్తాడు.
'నాకు జబ్బు చేసిందీ అన్నది పదోకవిత ఇందులో లోకంలో వున్న రకరకాల జబ్బులలిస్టులనూ వాట్కి చక్కని ప్రిస్క్రిప్షన్ ఉదాహరిస్తాడు. చలా వడి వడిగా నడిచే కవిత ఇది.ఇందులో బుచ్చిబాబుగారికున్న ప్రపంచ జ్ఞానం
మనకు సుబోధకమై నిలుస్తుంది.
కట్నంతో కన్నె పిల్ల
భర్తే దైవం
కుచేల సంతానం
కార్మికుల స్వర్గం
కాన్సర్ టీబీల కలసివున్న కాపురం
కూడులేని బిడ్డలే కర్షకుల ధాన్యం
అని నొక్కి వక్కాణిస్తూ
అంతేనా గుడ్దిలోకం
చరిత్ర చినుగులు కుడతావా?
నాకరికత శిధిలంపైనా నీ మకాం
కరుణ చూపని దైవమేనా నీ మొగుడు?
ఆకలి బాధల్ని కన్నావా
గతాన్ని పొట్టన బెట్టుకుని
లావైనావుగానీచావులేదా నీకు గుడ్డిలోకమా
అని గుచ్చి గుచ్చి తరచి తరచీ ప్రశ్ణీస్తాడు,
ప్రేమ పచ్చది
కీర్తికి ఎరుపు
హోదాకి ఆకు పచ్చ
ధనానికి నలుపు
వైరాగ్యానికి తెలుపు
అన్నీ వున్న వాడికేమో నా గుడ్ది కన్ను!
ఇవ్వండిక మీ కళ్ళకొలతలు
చచ్చిన మర్నాడు సరుకు సిద్ధం అని ఘంటా పధంగా చెప్తాడు తనమనో భావాలను కవి.
ఆఖరి కవిత అన్నింటిలోనూ సుదీర్ఘమైనది.
యుద్ధంలో శిధిలమైన
కొండ శిబిరం వలె
దుఃఖంలో ఏకమైన మంచు శిఖరాలు,
మంచుని మించిని మించిన తెల్లటి మందహాసం
మనలోమానవుడి వుయ్యాల.
మన శిఖరాలు అతని ఆదర్శం.
నానిశ్శబ్దం కవితంటాడు
నాఉనికే చిత్రకళంటాడు
నారక్తం అతని గుండెమీది గులాబీ పుష్పం.
నాతెలుపు అతని హృదయం
నాకంటీత్తు అతని ఆదర్శ శిఖరం
నాకంటె వెడల్పు అతని మానవ తత్వం
----
--
అతని ఎముక నా వెన్నెముక
అతని కన్ను మూత నా స్వప్న.ం
---
పచ్చ కొండలో పుడతాను
మనిషి గుండెలోకెడతాను.
అతనేనేను
నేనే అతను
అంటూ వచన కావ్యాన్ని ముగిస్తాడు బుచ్చి బాబు.
బుచ్చిబాబు ఆ సమయానికి కేవలం నినాదాలతో నింపబడి నిస్సారమైపోఉన్న
కవితామతల్లికి సుమహారంగా సహితీ సుగతునికి అన్వర్ధమైన స్వాగతం పలికేలా
తన వచన కావ్యాన్ని అందిస్తాడు.
మానవత్వాన్ని దాని విలువల్ని చాటే విధంగా మనకొక చిత్రరూప దర్శనం గావించారు ఈ కావ్యంతో ప్రతిభాశాలిగా బుచ్